ముంబై టెస్టులో విరాట్ "విశ్వ"రూపం

సూపర్‌ ఫాంలో ఉన్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ..ముంబైలో విశ్వరూపం చూపించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. 302 బంతుల్లో 23 ఫోర్ల సాయంతో డబుల్ మార్క్‌ను చేరాడు. 451/7 ఓవర్‌నైట్ స్కోరుతో నాల్గో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా..తొలి సెషన్‌లో పూర్తి ఆధిపత్యం సాధించింది..ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడు ప్రదర్శించాడు. జయంత్‌తో కలిసి విరాట్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ..తద్వారా మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెట్ కెప్టెన్‌గా విరాట్ రికార్డుల్లోకి ఎక్కాడు.