భారత్ లో 7 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7లక్షలు దాటింది. గత 24 గంటల్లో 22,252 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 467 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో, దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  7,19,665 కు చేరగా, మృతుల సంఖ్య 20,160కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి 4,39,948 మంది కోలుకోగా, ప్రస్తుతం 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu