వనస్థలిపురంలో విష రసాయనాలు..స్థానికులకు అస్వస్థత

హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం జరిగింది..ఆ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలు పడేశారు. దీంతో అందులో నుంచి వస్తోన్న గాఢమైన వాసనతో ఆ కాలనీవాసులు వాంతులు, తలనొప్పులతో అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రసాయనాల ప్రభావం చిన్నారులపై అధికంగా పడింది..వారి తలు ఉబ్బిపోయి కనిపిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. జరిగిన ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఇంతవరకు ఘటనాస్థలికి చేరుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.