వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమైన గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ముఖ్యంగా భారీ నష్టం చవిచూసిన గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ముంపు ప్రాంతాల్లోని ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారిని ఓదార్చారు. ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుందని సీఎం హామీ ఇచ్చారు.