సోనియా, రాహుల్ కు కోర్టు సమన్లు.. 2000 కోట్ల దుర్వినియోగం

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్ 7 న కోర్టులో హాజరుకావలసిందిగా సమన్లలో కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 2010లో నేషనల్ హెరాల్డ్ పబ్లిషింగ్ హౌజ్ కొనుగోలు వ్యవహారంలో దాదాపు రూ.2000 కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ బీజేపి నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, శ్యామ్ పిట్రోదాలకు కోర్ట్ సమన్లు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu