సచివాలయం కూల్చివేత పై హైకోర్టు స్టే పొడిగింపు

ఈ నెల 15 వరకు కూల్చివేతలు ఆపాలి

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత పై శుక్రవారం విధించిన స్టేను హైకోర్టు ఈ నెల 15 వరకు పొడిగించింది. సచివాలయం కూల్చివేయాలని క్యాబినెట్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? కూల్చివేతకు సంబంధించి ఇతర శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారా? ఈ వివరాలన్నీ కూడా సీల్డ్ కవర్ లో కోర్టు కు తెలియజేయాలన్నారు. సచివాలయం కూల్చివేత కారణంగా కాలుష్యం పెరుగుతుంది అంటూ ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు తీసుకున్న న్యాయస్థానం సోమవారం వరకు కూల్చివేతలు ఆపాలంటూ స్టే విధించింది. సోమవారం ఉదయం విచారణ కొనసాగిస్తూ  సచివాలయ భవనం కూల్చివేత పనులపై ప్రభుత్వం వివరాలు ఇవ్వాలని కోరింది.