ఉత్తరాంధ్రలో నేడు గవర్నర్ పర్యటన

 

ఉత్తరాంధ్రను పట్టి కుదిపేసిన హుదూద్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పర్యటించనున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకోనున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ అవసరమైన పనుల నిర్వహణకు చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చారు. గత రెండు రోజులుగా విశాఖలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులు, అధికారులతో తుఫాను నష్టంపై సమీక్ష నిర్వహించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu