మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం..

ఏపీలో మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. మూడు వారాల క్రితం ఈ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే దీని పై కొద్ది రోజులు గా ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే కొద్ది సేపటి క్రితం గవర్నర్ ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. మరో ముఖ్య విషయం ఏంటంటే కొద్ది రోజుల క్రితం వరకు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్న కన్నా లక్ష్మి నారాయణను తప్పించి సోము వీర్రాజును నియమించిన రెండు రోజులలోనే ఈ బిల్లులు ఆమోదం పొందడం గమనార్హం.