గవర్నర్‌‌తో సీఎం చంద్రబాబు భేటీ

 

రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలన అంశాలను సీఎం గవర్నర్‌కు  వివరించారు. అంతకు ముందు క్యాంపు కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతను ఉపయోగించి, పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని అధికారులకు సూచించారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు దిల్లీలో పర్యటించనున్నారు. బనకచర్ల అంశంపై గవర్నర్‌‌తో చర్చించినట్లు తెలుస్తోంది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu