ఆంధ్రావి తప్పుడు లెక్కలు-హరీశ్

నాబార్డుతో ఒప్పందం తెలంగాణకు ఎంతో మేలు చేస్తుందన్నారు ఆ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావ్. ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను కలిసిన అనంతరం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. నాబార్డు నిధులతో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 11 ప్రాజెక్ట్‌లతో పాటు, మొత్తం 99 ప్రాజెక్ట్‌లపై కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని ఆయన తెలిపారు. మొత్తం 11 ప్రాజెక్ట్‌లపై 7 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. పోతిరెడ్డిపాడు నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన ఆరోపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu