ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుంది... గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా 'మహాసంకల్పం' పేరిట గుంటూరులో భారీ సభను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి సంవత్సరం అయిందని, ఈరోజు రాష్ట్రానికి చాలా ముఖ్యమైన రోజని అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి చాలా కృషిచేస్తున్నారని, ఎప్పటికైనా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. రాజధాని నిర్మాణానికి పునాది రాయి పడిందని.. ఇక అభివృద్దే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మహాసంకల్పం పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని సీఎం చంద్రబాబు, గవర్నర్ ఆవిష్కరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu