రేపిస్టులు అమాయకులు.. గోవా మంత్రి

రేపిస్టులు ఒట్టి అమాయకులు.. వారికేం తెలియదు ఇవి ఎవరో అన్న మాటలు కాదు ఓ మంత్రి పదవిలో ఉండి బాధ్యతలు స్వీకరిస్తున్న దిలీప్ పరులేకర్. ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ పై ఆయన మాట్లాడుతూ రేప్ లు ఎక్కడ జరగట్లేదు చెప్పండి.. నా దృష్టిలో ఇవి చాలా చిన్న సంఘటనలు.. పాపం రేప్ చేసిన నిందుతులు చాలా అమాయకులు అని నోటికొచ్చినట్టు మాట్లాడారు. మంత్రిగారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు గోవా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఉర్ఫాన్ ముల్లా స్పందించి ప్రభుత్వం తీరువల్లే గోవాలో నేరాలు పెట్రేగిపోతున్నాయని మండిపడ్డారు. గోవా పర్యటనకు వెళ్లిన ఇద్దరు ఢిల్లీ మహిళల్నీసోమవారం ఐదుగురు కలిసి సామూహిక హత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మంత్రి పలికిన పలుకులు ఇవి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu