దేశవ్యాప్తంగా వీచిన నరేంద్ర మోడీ హవా..

 

మోడీ మంత్రం ఫలించింది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడిచింది. పదేళ్ళుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కాంగ్రెస్ పార్టీ పీడ వదిలింది. దేశంలో ఎక్కడ చూసినా వినిపించిన మోడీ మంత్రం ఫలించింది. బీజేపీ అధికారంలోకి రావడానికి భారతీయ ఓటర్లు రాజమార్గం వేశారు. ఇక దేశం గడచిన దశాబ్దపు పీడకలను మరచిపోవచ్చన్న అభిప్రాయంలో దేశ ప్రజలు వున్నారు. కాంగ్రెస్ పార్టీ కారు చీకట్లలో మగ్గిపోతున్న భారతీయ ప్రజలకు ఆశాకిరణంలా కనిపించిన మోడీకే పట్టం కట్టారు. దేశంలో కాంగ్రెస్ కుటుంబ పాలనను కట్టిపెట్టారు. నెల రోజులకు పైగా దేశంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారంటూ పెరిగిన ఉత్కంఠకు భారతీయుడు తన ఓటుతో తెర వేశాడు. భారతీయ జనతాపార్టీకి ఘన విజయాన్ని అందించాడు. ఉత్తర భారతదేశం, ఈశాన్యం, దక్షిణం, పశ్చిమం.. ఎక్కడ చూసినా బీజేపీ, ఎన్టీయే అనుకూల ఫలితాలు వచ్చాయి. నియంతలా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం, పరాభవం ఎదుర్కుంది. ఇప్పుడు దేశ ప్రజలు నరేంద్ర మోడీ వైపు నమ్మకంతో చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కుంటుపడిన భారతదేశ అభివృద్ధిని ప్రగతి పథంలో శరంవేగంగా పయనించేలా చేస్తారని ఆశిస్తున్నారు.