సవాళ్లను ఎదుర్కోవడానికి చర్చలు పరిష్కారం కాదు

సవాళ్లను ఎదుర్కోవడానికి చర్చలు పరిష్కారం కాదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న జీ20 దేశాల సదస్సులో మోడీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి జీ20 దేశాలు నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సంక్లిష్ట రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్న సమయంలో ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. అభివృద్ధి అంచనాలు అందుకోవడానికి తమ ప్రభుత్వం చేపడుతున్న కొన్ని పనులను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం, మౌళిక వసతుల అభివృద్ధి, విలువైన మానవ వనరుల సృష్టి వంటివి లక్ష్యాలుగా నిర్దేశించుకున్నట్లు మోడీ వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu