పారిస్‌లో కాల్పులు.. 12 మంది మృతి

 

ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్‌లో బుధవారం నాడు జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఫ్రెంచ్ వ్యంగ్య పత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంలో ఈ కాల్పులు జరిగాయి. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. పత్రిక ఎడిటర్‌తోపాటు 12 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇదే ప్రతిక కార్యాలయం మీద పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ఈ కాల్పులు జరిపింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా ఈఫిల్ టవర్ని మూసేశారు. గతంలో మహ్మద్ ప్రవక్త, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కమాండర్‌కు వ్యతిరేకంగా చార్లీ హెబ్డో పత్రిక కార్టూన్లు ప్రచురించింది. సిడ్నీలో కాల్పుల ఘటన జరిగి పక్షం రోజులు గడవకముందే ఫ్రాన్స్ లో ఈ ఘటన జరిగింది. ఫ్రాన్స్ ఘటనతో యూరప్, అమెరికా అంతటా హై అలర్ట్ ప్రకటించారు.