అప్పు తీర్చలేదని కత్తితో దాడి..

హైదరాబాద్ నగరంలో వడ్డీవ్యాపారుల ఆగడాలు మరోసారి బయటపడ్డాయి. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన నగరంలో వెలుగు చూసింది వివరాల ప్రకారం.. నాచారంలో కుమార్ గౌడ్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. అతని దగ్గర గిరి అనే వ్యక్తి రూ 30 లక్షల మేర అప్పు తీసుకున్నాడు. అయితే గిరి నెల నెలా వడ్డీ కడుతున్నప్పటికీ తీసుకున్న మొత్తం ఒకేసారి చెల్లించాలని.. అసలు వడ్డీతో కలిపి మొత్తం ఇప్పుడు కోటి రూపాయలు చెల్లించాలని కుమార్ గౌడ్.. గిరిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కుమార్ గౌడ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గిరిపై దాడి చేశాడు. ఈ దాడిలో గిరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన గిరిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు సమాచారం అందుకున్న నాచారం పోలీసులు కుమార్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu