జూబ్లీహిల్స్‌ లో కూతురిపై తండ్రి దారుణం..

నేటి సమాజంలో కొంత మంది తల్లి దండ్రులను కన్నవాళ్ళు అనడం కంటే కసాయి వాళ్ళు అనడం మంచింది అనిపిస్తుంది వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే కసాయి వాళ్ళైనా ఎప్పుడో ఒకసారి కనికరిస్తారేమో గాని, కొంత మంది  దుర్మార్గులు మాత్రం తమ కన్నా పిల్లపై కనికరం చూపించడం లేదు.. కుటుంబంలో తండ్రి అనేవాడు శిఖరం లాంటి వాడు.. ఆ శిఖరం అనే పదాన్ని కొంత మంది దుర్మార్గులు దిగజారుస్తున్నారు. పిల్లపైనే దారుణాలకు తెగపడుతున్నారు. తాజాగా ఓ తల్లి  కూతురు, కుమారుడు డల్‌గా ఉండటంతో తల్లి వారిని సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లింది. అక్కడికి వెళ్ళాక కన్నా తండ్రి కుటిలత్వం బయటపడింది.  ఎవరూ లేని సమయంలో తన శరీర భాగాలను తాకుతూ తండ్రి, అతని స్నేహితుడు అసభ్యంగా ప్రవర్తించారని కూతురు తెలిపింది.
 
వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు(45) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.70లో నివాసం ఉంటాడు. అతడికి 2003లో వెంకటగిరికి చెందిన మహిళ(40)తో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు(14), కొడుకు(11) ఉన్నారు. గతంలో అమెరికాలో ఉండే ఈ దంపతులు 2010లో హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. అప్పటి వరకు బాగానే ఉన్న వాళ్ళు. ఏమైందో ఏమో తెలియదుగాని 2018లో కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారు ఉంటున్నారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా కూతురు, కుమారుడు అన్యమనస్కంగా ఉండటాన్ని తల్లి గుర్తించింది. ఏం జరిగి ఉంటుందని అనుమానించిన ఆ తల్లి  పిల్లలను సైకాలజిస్ట్‌ వద్దకు తీసుకెళ్లింది. కౌన్సెలింగ్‌ ఇప్పించగా మూడేళ్ల క్రితం  ఎవరూ లేని సమయంలో తన శరీర భాగాలను తాకుతూ తండ్రి, అతని స్నేహితుడు(45) అసభ్యంగా ప్రవర్తించారని కూతురు చెప్పగా తనను నగ్నంగా చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడని కుమారుడు చెప్పుకొచ్చాడు. దీంతో తల్లి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో చ ట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితు డిని అరెస్ట్‌ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు.