సాఫ్ట్‌వేర్‌లోనే లోపాలు.. మళ్లీ ఫలితాలు అలాగే వస్తాయి

 

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా టెక్నాలజీ సంస్థ వ్యవహారంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. గురువారం విచారణ చేపట్టిన అధికారులు గ్లోబరినా టెక్నాలజీ సంస్థ ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌లోనే లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సాఫ్ట్ వేర్ ను మార్చకపోతే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసినా ప్రయోజనం ఉండదని, మళ్లీ అదే రీతిలో మార్కులు తప్పులతడకలుగా వస్తాయని త్రిసభ్య కమిటీ సభ్యులు  అభిప్రాయపడ్డారు. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ప్రక్రియలో మళ్లీ తప్పులు జరగకుండా ఉండేందుకు కమిటీ పలు సూచనలు చేయనుంది. యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై ఈ రోజు సాయంత్రం త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.