సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ విషయంలో నగదు లావాదేవీల వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది.  సురానా గ్రూప్, సాయి డెవలపర్స్ అడ్వర్టైజ్ మెంట్ల కు మహేష్ బాబు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారన్న సమాచారంపై ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అడ్వర్టైజ్ మెంట్లకు మహేష్ బాబుకు ఇచ్చిన రెమ్యూనరేషన్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ అనుమానిస్తోంది.ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు మహేష్ బాబు చేసిన అడ్వర్టైజ్ మెంట్ల కారణంగా పలువురు పెట్టుబడులు పెట్టారని ఈడీ చెబుతోంది. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో మహేష్ బాబుకు భాగస్వామ్యం లేనప్పటికీ.. వాటికి సంబంధించిన ప్రమేషన్ లలో పాల్గొని అక్రమ పద్ధతిలో డబ్బులు తీసుకున్నందుకే ఈడీ ఈ నోటీసులు జారీ చేసిందని చెబుతున్నారు.  

ప్రస్తుతం హీరో మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులైలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా మహేష్ బాబు పలు బ్రాండ్ల యాడ్ లలో నటిస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరైన మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.