ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతులలో ఇద్దరు మహిళా మావోలు ఉన్నారు.   బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాల్పేరు నది సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

 యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా సీఆర్పీఎఫ్ జవాన్లు   డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా సిబ్బంది కూంబింగ్ జరుపుతుండగా తొలుత నక్సల్స్‌ కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.  

ఘటనా స్థలం నుంచి భారీ పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరి కొందరు నక్సల్స్ గాయపడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.