ఈజిప్టులో మారణకాండ... 23 మంది మృతి..

 

ఈజిప్టులో దుండగలు మారణకాండ సృష్టించారు. వివరాల ప్రకారం.. దక్షిణ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌ అన్బా శామ్యూల్‌ మొనాస్టరీకి బస్సులో  వెళ్తున్న క్రైస్తవులపై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలింపు చేపట్టారు. దేశంలోని కోప్టిక్‌ క్రైస్తవులపై గత కొంతకాలంగా ఐఎస్‌ఐ తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu