గుజరాత్‌లో భూప్రకంపనలు...

గుజరాత్‌లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కచ్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. దీని కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. భూకంపం భయంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లడానికి జంకుతున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో భూమి కంపించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu