మోడీతో ట్రంప్ ముచ్చట..


అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రకటన చేసింది.  ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  ట్రంప్‌ ఇప్పటికే కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్‌, ఈజిప్టు దేశాధినేతలకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయన మాట్లాడుబోతున్న ఐదో విదేశీ ప్రధాని మోదీ. కాగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మోడీ ఆయనకు ఫోన్ చేసి అభినందించిన సంగతి తెలిసిందే.