యూపిఏ కు డీఎంకే షాక్

 

 

DMK pulls out of UPA govt over Sri Lanka Tamils issue, DMK pulls out of UPA govt

 

 

యూపిఏ ప్రభుత్వానికి డీఎంకే షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలుగుతున్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి ఈరోజు వెల్లడించారు. శ్రీలంకలోని తమిళ హక్కుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగింది. కేంద్ర మంత్రి వర్గం నుంచి డీఎంకే కు చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. జెనీవాలో జరిగే ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ భేటీలో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కరుణానిధి మరోసారి డిమాండ్ చేశారు. 18 ఎంపీల బలం వున్న డీఎంకే యూపిఏ లో రెండో అతిపెద్ద భాగస్వామి. డీఎంకే నిర్ణయంతో యూపిఏ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News