తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం(సెప్టెంబర్ 8) ఉదయం తిరుమలేశుని దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (సెప్టెంబర్ 7) శ్రీవారిని మొత్తం 83వేల960 మంది దర్శించుకున్నారు.

వారిలో 32 వేల 342 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 96 లక్షల రూపాయలు వచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu