తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో తొమ్మిది కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. కాగా శుక్రవారం శ్రీవారిని మొత్తం 60,517  దర్శించుకున్నారు.

వారిలో 27,788 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.3.53 కోట్లు  వచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu