జనసంద్రమైన ఖైరతాబాద్ 

వీకెండ్ కావడంతో ఖైరతాబాద్ గణ నాథుడిని చూడటానికి భక్తులు బారులు తీరారు. శని, ఆదివారం మాత్రమే గణ నాథుడిని చూసే అవకాశం ఉండటంతో వేలాదిమంది ఖైరతాబాద్ చేరుకుంటున్నారు. గత సంవత్సరం దాదాపు 20 లక్షల మంది గణ నాథుడిని చూసిన ప్రజలు ఈ యేడు మరో పది లక్షలమంది ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయని నిర్వాహాకులు తెలిపారు. దేశంలోనే అతపెద్దదైన గణేష్ విగ్రహాన్ని దర్శించడం సోమవారం ఉండదని వారు చెప్పారు. మంగళవారం నిమజ్జనం కార్యక్రమానికి 25 వేల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విగ్రహన్ని  మంగళవారం మధ్యాహ్నంలోపు తరలించాలని పేర్కొంది సెప్టెంబర్ ఏడో తేదీన వినాయకచవితి ప్రారంభమైంది. వరుసగా తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజులు భక్తులు పోటెత్తే అవకాశాలు ఉండటంతో నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు..  ప్రతీయేడు మాదిరిగా  ఈ నెల 17న హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. రెండో శనివారం , ఆదివారం, మిలాదున్ నబీ, నిమజ్జనం కాబట్టిఈ నెల 14 నుంచి 17 వరకు  విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు లభ్యమయ్యాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu