చిన్నారుల డైపర్లలో బంగారు బిస్కెట్లు...


ఇప్పటివరకూ పలు అక్రమ మార్గాల ద్వారా బంగారం తరలించడం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు తాజాగా చిన్న పిల్లలు వాడే డైపర్లలో బంగారం తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...  ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబా య్ నుంచి ఢిల్లీ విమానం రాగా ఇందులో  సూరత్‌కు చెందిన ఆరుగురు వచ్చారు. వీరిలో ఇద్దరి మహిళల వద్ద పాపలు ఉన్నారు. ఇక ఉదయం 7 గంటలకు భద్రతా సిబ్బంది ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా చిన్నారుల డైపర్లలో బంగారు బిస్కెట్లు కనిపించాయి. కేజీ బరువున్న 16 బంగారు బిస్కెట్లను రెండు డైపర్ల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు వారిని విచారిస్తున్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu