నిర్ణయాలన్నీ మన్మోహన్ సింగ్ వే.. దాసరి

జార్ఖండ్‌లోని అమరుకొండ ముర్గా దుంగల్‌ బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతోపాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాసరి మంగళవారం ఢిల్లీలోని ఢిల్లీలోని సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ బొగ్గు కుంభకోణంలో తన ప్రమేయం ఏం లేదని.. యుపిఎ ప్రభుత్వ హయాంలో తాను కేవలం సహాయ మంత్రిగా మాత్రమే ఉన్నానని చెప్పారు. అప్పుటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బొగ్గు మంత్రిత్వ శాఖ ఇంచార్జీగా ఉండేవారని.. నిర్ణయాలన్నీ తనే తీసుకునేవారని చెప్పారు.