ముచ్చటగా మూడోసారి ఓడిన డి.శ్రీనివాస్

 

 

 

ఆల్రెడీ శాసనమండలి సభ్యుడిగా వున్న డి.శ్రీనివాస్ ఇంకా ఏదో సాధించాలని నిజామాబాద్ రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఫలితం మరోసారి.. ఇంకా చెప్పాలంటే ముచ్చటగామూడోసారి ఓడిపోయారు. ఓటమిలో ఆయన హ్యాట్రిక్ సృష్టించారు. ధర్మపురి శ్రీనివాస్ వరుసగా మూడోసారి పరాజయం పాలయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డిఎస్, టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తొలిసారి 2009లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీ నారాయణ చేతిలో ఓడిపోగా, రెండవ సారి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో అదే ఎందల లక్ష్మీ నారాయణ (బిజెపి) చేతిలో డిఎస్ కంగుతిన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి భయంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మారినా ప్రయోజనం లేక పోయింది. బాజిరెడ్డి గోవర్ధన్ చివరి క్షణంలో వైకాపా నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్‌లో చేరి డీఎస్‌పై సంచలన విజయం సాధించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu