కరెంట్ షాక్.. తల్లీ కొడుకుల మృతి

 

కరెంట్ షాక్‌కి గురై తల్లీ కొడుకులు మరణించారు. గుంటూరు జిల్లా నగరం మండలం ఈదుపల్లి గ్రామంలో ఈ విషాద సంఘటన జరిగింది. చింతల నాంచారమ్మ (55) అనే మహిళ మంగళవారం రాత్రి వర్షం పడుతూ వుండగా ఇంట్లోని విద్యుత్ కేబుల్‌ను సరిచేసే ప్రయత్నం చేసింది. వర్షం కారణంగా విద్యుత్ తీగలు బాగా తడిసిపోయి వుండటంతో ఆమెకు తీవ్ర విద్యుదాఘాతానికి గురై కిందపడి గిలగిలా కొట్టుకుంటోంది. దాన్ని గమనించిన ఆమె కుమారుడు శ్రీనివాసరావు (35) తల్లిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో శ్రీనివాసరావు కూడా కరెంట్ షాక్‌కి గురయ్యాడు. ఈ సంఘటనలో తల్లీకొడుకులు ఇద్దరూ మరణించారు.