ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈఆర్‌సి ఛైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. నెలకు 2 వందల యూనిట్ల పైన విద్యుత్ వాడకానికి ఛార్జీలు పెంచారు. గృహ విద్యుత్ విషయంలో 2 వందల యూనిట్ల వరకు ఛార్జీల పెంపు లేదు. వ్యవసాయానికి, కుటీర పరిశ్రమలకు ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎల్‌టీ కేటగిరీ - 3లో మరికొంతమంది ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. చక్కెర మిల్లులు, పౌల్ట్రీ పరిశ్రమలకు ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి 3,186 కోట్ల రాయితీ లభించిందని ఈఆర్‌సి ఛైర్మన్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu