సీపీఐ రామకృష్ణకి జైలు

 

భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వరంగల్ ఫస్ట్ క్లాస్ట్ మేజిస్ట్రేట్ కోర్టు రామకృష్ణకు ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది. రామకృష్ణతో పాటు ఆ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నేత విశ్వేశ్వర రావులకు కూడా ఇదే తరహా శిక్షను ఖరారు చేసింది. వరంగల్ మార్కెట్‌లో 2012 సంవత్సరంలో రైతులకు మద్దతు ధర కల్పించాలని ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న 12 మందిని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనడం, అడపాదడపా ఆస్తినష్టానికి కూడా కారణం కావడం గతంలో ఎన్నోసార్లు జరిగింది. అలా ఆస్తినష్టం చేసినందుకు జైలు శిక్ష పడటం మాత్రం ఇటీవలి కాలంలో మాత్రం ఇదే కావడం విశేషం.