చెక్ బౌన్స్ కేసులో జీవిత రాజశేఖర్

 

Court summons Jeevitha Rajasekhar, Actor Rajasekhar Jeevitha

 

 

జీవిత, రాజశేఖర్ దంపతులు చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నారు. ఈ మేరకు సెప్టెంబరు 20వ తేదీని కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు వారిద్దరికి ఆదేశాలు జారీచేసింది. పరంధామ రెడ్డి అనే వ్యక్తి వద్ద సినీ నటి జీవిత రూ.34 లక్షలు అప్పుగా తీసుకుంది. ఈ మేరకు ప్రామిసరి నోటుతో పాటు రెండు చెక్కులు కూడా ఇచ్చింది. ఈ మొత్తం చెల్లించకపోవడంతో రెండు చెక్కులను పరంధామ రెడ్డి బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అందులో డబ్బులు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి. ఫిర్యాదును పరిశీలించిన 7వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్టేట్ చెల్లని చెక్కు కేసులో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని జీవితా రాజశేఖర్‌ను ఆదేశిస్తూ కోర్టు సమన్లు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu