చూడచక్కని జంట.. కానీ...

 

చూడచక్కని జంట.. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ గొడవలు పెరిగిపోయి ఆ జంట మరణానికి కారణమయ్యాయి. నల్గొండ జిల్లా చండూరుకు చెందిన వైద్యుడు రఘు వివాహం మూడేళ్ళ క్రితం హైదరాబాద్‌కి చెందిన కల్పనతో జరిగింది. వీరికి ఒక ఏడాది వయసున్న కుమార్తె కూడా వుంది. చండూరులోనే వైద్యుడిగా విధులు నిర్వర్తించే రఘు స్థానికంగా మంచి పేరు వున్న వ్యక్తి. రఘు, కల్పన ఎంతో అన్యోన్యంగా వుంటారన్న అభిప్రాయాలు కూడా వున్నాయి. అయితే వీరిద్దరూ గత కొద్ది రోజులుగా కుటుంబానికి సంబంధించిన అంశాలలో గొడవ పడుతున్నారు. మంగళవారం నాడు కూడా వీరిద్దరూ తీవ్రంగా గొడవపడ్డారు. ఈ సందర్భంగా కల్పన ఇంట్లో అందుబాటులో వున్న పురుగుల మంది తాగి చనిపోయింది. తన కళ్ళముందే తన భార్య పురుగుల మందు తాగి మరణించడం చూసి తట్టుకోలేని రఘు కూడా పురుగుల మందు తాగేశాడు. ఈ విషయాన్ని గమనించిన వారు రఘును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబంలోని చిన్న చిన్న గొడవలు వీరిద్దరి ప్రాణాలు తీశాయని స్థానికులు చెబుతున్నారు.