ఏపీలో ఒకేరోజు నాలుగు కరోనా మరణాలు 

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 8,066 శాంపిల్స్ ను పరీక్షించగా 79 మందికి కరోనా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,279కి చేరుకుంది. ఏపీలో 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 68కి చేరింది. ఇక, 24 గంటల్లో 35 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 2,244 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 967 మంది చికిత్స పొందుతున్నారు.