ఎమ్మెస్సార్ వృద్దాప్యంలో ఉన్నారు.. గుత్తా
posted on Nov 14, 2015 4:04PM
.jpg)
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. నారాయణ కేసీఆర్ ను ప్రశంసించిన సంగతి తెలిసింది. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎమ్మెస్సార్.. కేసీఆర్ పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని.. ప్రతిపక్షాలు విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్యలపై ఆపార్టీనేత, పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెస్సార్ క్రియాశీల రాజకీయాలనుండి ఎప్పుడో తప్పుకున్నారని.. ఆయన వృద్దాప్యంలో ఉన్నారు.. అందుకే ఆయనకు కేసీఆర్ పాలనపై సరైన అవగాహన లేదని విమర్శించారు. ఈ వయసులో ఆయనకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. మరి గుత్తా చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెస్సార్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.