సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి...బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

 

శాసన సభలో కృష్ణా జలాల పై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించారని  అసెంబ్లీ సెక్రటరీ తిరుపతికి  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు కాపీ అందజేశారు. ఇటీవల అసెంబ్లీలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి  పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరారు. 

అపెక్స్ కౌన్సిల్ సమావేశ మినిట్స్ పై సీఎం తప్పుదోవ పట్టించారని, రాయలసీమ ఎత్తిపోతల పనుల నిలిపివేత, కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందంపై సీఎం సభను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‍ సూచన మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కే .పీ వివేకానంద ,కోవాలక్ష్మి ,విజయుడు ,అనిల్ జాదవ్ శాసన సభ కార్యదర్శికి నోటీసులు అందజేశారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu