కేజ్రీవాల్ క్రేజీ డెసిషన్.. నెటిజన్ల సెటైర్లు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ ఆచరణ సాధ్యంకాని నిర్ణయం తీసుకొని ఇప్పుడు అందరిచేత విమర్శలు పొందుతున్నారు. ఢిల్లీలో వాయుకాలుష్యం బాగా పెరిగిపోయిందని.. గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లు బతుకుతున్నామని.. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించకుండా ఏంచేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో హడావుడిగా కేజ్రీవాల్ మీటింగ్ పెట్టి.. ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంతో ఢిల్లీ ప్రజలందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అదేంటంటే.. దిల్లీలో ఇకపై ఒక రోజు సరిసంఖ్య ఉన్న వాహనాలే తిరగాలట. ఇంకో రోజు బేసి సంఖ్య వాహనాలే రోడ్డు మీదికి రావాలట. దీంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చంట. ఇక అంతే కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంతో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్ల వేయడం మొదలుపెట్టారు. ఇక ప్రతి ఇంట్లోనూ రెండు కార్లు రెండు బైకులు పెట్టుకోవాలని.. ఒకదాన్ని బేసి సంఖ్యతో ఇంకోదాన్ని సరిసంఖ్యతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఒకరంటే..కార్లు బైకుల కంపెనీల సేల్స్ పెంచడానికి కేజ్రీవాల్ పన్నిన కుట్ర ఇదని ఒంకొకరు... అర్రే నా కారుది ప్రైమ్ నంబరే మరి నేనేం చేయాలని ఇంకొకరు అలా కామెంట్లు విసురుతున్నారు. మొత్తానికి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం పాటించడమేమో కాని.. జోకులు పేల్చుకోవడానికి మాత్రం పనికొచ్చింది. మరి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారో.. లేక వెనక్కి తీసుకుంటారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu