సీబీఐ విచారణలో హరీశ్ రావత్.. స్టింగ్ ఆపరేషన్ పై ప్రశ్నల వర్షం..
posted on May 24, 2016 12:46PM

ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కు మరో సమస్య వచ్చిపడింది. ఇప్పటికే కోర్టు పుణ్యమా బలపరీక్షలో నెగ్గి తిరిగి అధికారాన్ని చేపట్టిన హరీశ్ రావత్ ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా బుక్కయిన కారణంగా సీబీఐ విచారణలో పాల్గొనాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుండి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆపార్టీ నేతలతో మంతనాలు జరిపి స్టింగ్ ఆపరేషనల్లో అడ్డంగా బుక్కయ్యారు హరీశ్ రావత్. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ... విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు ఇటీవలే నోటీసులు జారీ చేసింది. దీనిలోభాగంగానే హరీశ్ రావత్ ఈరోజు సీబీఐ విచారణలో పాల్గొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై సీబీఐ అధికారులు హరీశ్ రావత్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది.