అత్యాధునికంగా చంద్రబాబు క్యాంపు కార్యాలయం

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం విజయవాడలో ఏర్పాటు చేయనున్న క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం రూ. 10.21 కోట్లు మంజూరు చేసింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న జలవనరులశాఖ కార్యలయంలో చంద్రబాబు నివాసం కోసం అత్యాధునిక వసతులతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం ఛాంబర్, ఆయన రాకపోకలు సాగించే ప్రాంతం, తలుపులు బులెట్ ప్రూఫ్ తో ఏర్పాటవుతున్నాయి. శాటిలైట్ ఫోన్లు జామర్లు, రాకెట్ లాంచర్ల దాడుల నియంత్రణతో కూడిన సాంకేతిక వస్తువుల వినియాగం జరుగుతుంది. జూన్ 2వ తేదీ నుండి వారానాకి మూడు రోజులు చంద్రబాబు ఇక్కడే ఉంటారు. అక్కడ నుండే ఆయన వివిధ ప్రాంతాలకు పర్యటించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu