చైనాలో విచిత్రం.. అబ్బాయి ఆత్మకు, మహిళ మృతదేహానికి పెళ్లి

 

చైనాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా వివాహం.. యువతి, యువకులు చేసుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా ఆత్మకు పెళ్లి చేశారు. వినడానికి విచిత్రంగా ఉంది కదా.. అసలు సంగతేంటంటే.. చైనాలో షాంగ్జీ రాష్ట్రంలోని ఒక కుటుంబానికి చెందిన కుమారుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. అయితే పెళ్లి కాకుండానే బ్రహ్మచారిగా తన కొడుకు మరిణించాడని.. తన ఆత్మకు శాంతించాలని ఒక మహిళ మృతదేహంతో పెళ్లి జరిపించారు అతని కుటంబసభ్యులు. దీనికోసం ‘వధువు’ కుటుంబానికి రూ.18 లక్షలు కూడా ఇచ్చారంట. మామూలుగా అయితే అంతకంటే ఎక్కువే సమర్పించుకోవాలట. కానీ ఇరువురు తెలిసిన వారు కావడంతో తక్కువ మొత్తానికే ఒప్పుకున్నట్టు సమాచారం. పెళ్లి కాకుండా మరణిస్తే శాపం చుట్టుకుంటుందనే విశ్వాసంతో వారికి పెళ్లి జరిపించడం అక్కడ పురాతన సంప్రదాయం.