కొందరు రాష్ట్రానికి పెట్టుబడులే రాలేందంటున్నారు-చంద్రబాబు

కొందరు వ్యక్తులు రాష్ట్రానికి పెట్టుబడులే రాలేందంటున్నారని కాని జరుగుతున్న అభివృద్ధి వారి కళ్లకు కనిపించడం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నీతి ఆయోగ్ వైఎస్ ఛైర్మన్ అరవింద్ పనగారియాతో సీఎం ఇవాళ విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం ఆయనతో కలిసి సమావేశ వివరాలను చంద్రబాబు మీడియాకు వివరించారు. నేటి వరకు 15.8 శాతం పెట్టుబడులు ఆకర్షించామని, అలాగే పెట్టుబడుల వివరాలను నీతి ఆయోగ్ బృందానికి వివరించామని తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఏపీ అగ్రస్థానంలో ఉందని..విద్యుత్ సరఫరాలో నష్టాలను సింగిల్ డిజిట్‌కు తెచ్చామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ కర్నూలులో ఏర్పాటువుతోందని..దానిని ఏప్రిల్‌లో ప్రారంభిస్తామన్నారు. కోస్టల్ ఎకనామిక్ అంట్ ఎంప్లాయిమెంట్ జోన్ గురించి నీతీ ఆయోగ్‌కు వివరించామని..చైనా మాదిరిగా భారత్‌లో కూడా క్లస్టర్ల ఏర్పాటుకు నీతి ఆయోగ్ ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.