ముగ్గురు భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించిన పాక్

గూఢచర్యం ఆరోపణలపై ముగ్గురు భారతీయ దౌత్య అధికారులను ఇవాళ పాకిస్థాన్ వెలివేసింది. అనురాగ్ సింగ్, విజయ్‌కుమార్ వర్మ, మాధవన్ నందా కుమార్‌లపై ఈ ఆరోపణలు చేసింది. దీంతో వారు ముగ్గురు ఇస్లామాబాద్ నుంచి భారత్‌కు బయల్దేరారు. వీరితో పాటు మొత్తం 8 మంది దౌత్య అధికారులపై పాకిస్థాన్ గూఢచర్యం ఆరోపణలు చేసింది. మిగతా అధికారులు కూడా వాఘా సరిహద్దు ద్వారా భారత్‌కు రానున్నారు. కాగా రా, ఇంటెలిజెన్స్ బ్యూరోల సూచనల మేరకు భారత దౌత్య అధికారులు పనిచేశారని పాక్ విదేశాంగ ప్రతినిధి నఫీస్ జకారియా ఇటీవల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇది ఉగ్ర కార్యకలాపాల కిందకే వస్తుందని అలాంటి అధికారులను పాక్ ఎంతమాత్రం సహించేది లేదని ఆయన అన్నారు.