అతను పడిపోయాడా? తోశారా?

 

చెన్నైఓల్డ్ మహాబలిపురంలోని పెరుంగుడిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనుమానాస్పందంగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేలూరు జిల్లా, రాణిపేటకు చెందిన అరవింద్ పెరుంగడిలో ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అరవింద్ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరగా, ఇంతలో హఠాత్తుగా ఆ కంపెనీ 8 వ అంతస్తు నుండి పడిపోయాడు. దీంతో రక్తపు మడుగులో ఉన్న అరవింద్ ను వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా కిందికి తోసేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.