ఛత్తీస్ గఢ్ లో ఎదురుకాల్పులు, ఆరుగురు హతం

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది, జగ్దల్ పూర్ జిల్లా దర్భాఘాట్ అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు హతమయ్యారు, దర్భాఘాట్ ప్రాంతంలో వందలాది మంది గ్రామస్తులను మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో... వారిని వెతికేందుకు కూంబింగ్ చేపట్టిన పోలీసులకు మావోలు ఎదురుపడటంతో ఎన్ కౌంటర్ జరిగినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు, ఈ ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోతోపాటు మొత్తం ఆరుగురు హతమైనట్లు పోలీసులు ప్రకటించారు