మంత్రి బొజ్జల భార్యపై వైసీపీ తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భార్యపై వైసీపీ లీడర్ మధుసూదనారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు, శ్రీకాళహస్తి ఆలయంపై బొజ్జల భార్య, కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిపోయిందని, బొజ్జల ఫ్యామిలీ ఆదేశాలను గుడిలో అమలు చేస్తున్నారంటూ ఆరోపించారు, శ్రీకాళహస్తి ఆలయంలోని వ్యవహారాలన్నీ బొజ్జల భార్య కనుసన్నల్లోనే సాగుతున్నాయని, ఇదేమైనా బొజ్జల ఫ్యామిలీ జాగీరా అంటూ మధుసూదనారెడ్డి ప్రశ్నించారు, గుడిలో తనిఖీలు చేస్తూ హడావిడి చేస్తున్న మంత్రి సతీమణి.... ఏ హోదాలో చేస్తున్నారో చెప్పాలన్నారు, మంత్రిగా బొజ్జలకు శ్రీకాళహస్తి ఆలయంపై సమీక్ష చేసే అధికారముందని, ఆయన భార్యకు కూడా అధికారాలుంటాయా అని ప్రశ్నించారు, ఇక్కడ జరుగుతున్న అవినీతికి కూడా మంత్రి కుటుంబం కొమ్ముకాస్తోందని వైసీపీ లీడర్ మధుసూదనారెడ్డి ఆరోపించారు