బాలయ్య పాదయాత్ర

 

 

chandrababu naidu balakrishna, nara lokesh chandrababu naidu

 

 

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తో రెండు రోజుల పాటు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ''వస్తున్నా మీకోసం'' పాదయాత్రలో పాల్గొననున్నారు. ప్రస్తుతం బాబు పాదయాత్ర పామర్లు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇదే నియోజకవర్గంలో బాలకృష్ణ తల్లి స్వగ్రామం కొమరవోలు ఉంది. ఈ గ్రామానికి బాబు పాదయాత్ర సోమవారం చేరుకుంటుంది. తల్లి స్వగ్రామం బాబు యాత్ర చేరుకునే సమయానికి బాలయ్య కూడా పాదయాత్రలో పాల్గొంటారు.


మరోవైపు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మూడు రోజుల తర్వాత చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో కుప్పంలో ఉండి పార్టీ నేతలతో సమావేశం అవుతారు. లోకేష్ ఇటీవల కూడా ఓసారి కుప్పం నేతలతో సమావేశమయ్యారు.