మరికొద్ది సేపటిలో రాజమండ్రీ చేరుకోనున్న చంద్రబాబు

 

ఈరోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో మామిడికుదురు మండలంలో నగరం గ్రామంలో గెయిల్ సంస్థకు చెందిన గ్యాస్ పైప్ నుండి గ్యాస్ లీక్ అవడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్యా 15కు చేరింది. గాయపడిన వారినందరినీ అమలాపురం, కాకినాడ తదితర ప్రాంతాలలో ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం గురించి తెలిసుకొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే హోం మంత్రి చిన రాజప్పను అక్కడికి పంపించారు. జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను కూడా తక్షణమే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చెప్పట్టవలసిందిగా ఆదేశించారు. ఈదుర్ఘటనపై విచారణకు కూడా ఆదేశించారు. ఆయన ప్రస్తుతం డిల్లీలో ఉన్నందున వెంటనే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఈ దుర్ఘటన గురించి ఆయనకు వివరించడంతో ఆయన భాదితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించి, మున్ముందు ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు కేంద్రమంత్రులతో తన తదుపరి సమావేశాలనట్టినీ రద్దు చేసుకొని పెట్రోలియం శాఖ మాత్రి ధర్మేంద్ర ప్రాధాన్ ను వెంటపెట్టుకొని రాజమండ్రీ బయలుదేరుతున్నారు. అక్కడి నుండి వారిరువురూ రోడ్డు మార్గం ద్వారా ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu