రాజ్యసభ ట్విస్ట్: చైతన్యరాజు తప్పుకున్నారు..

 

 

 

రాజ్యసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చైతన్యరాజు చివరి నిమిషంలో బరిలో నుంచి వెనక్కి తప్పుకున్నారు. ఈ రోజు ఉదయం చైతన్యరాజు , సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటి అయ్యారు. కిరణ్ ఆయనతో చర్చలు నామినేషన్ ఉపసంహరణకు ఒప్పించినట్లు తెలుస్తోంది. మంత్రులు గంటా, ఏరాసు, శైలజానాథ్, ఎంపీ ఉండవల్లితో కలిసి చైతన్యరాజు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఉపసంహరణ లేఖను అందజేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకే నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు చైతన్య రాజు కూడా చెప్పారు. సమైక్యవాదానికి మద్దతుగా అని చెప్పిన చైతన్యరాజు, రాష్ట్ర సమైక్యతపై ఏం హామీ ఎవరి నుంచి పొంది నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారో!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu